WhatsApp Image 2020 08 10 at 19.38.55

మనిషి కాదు.. మైనపు బొమ్మ

ಉತ್ತರ ಕರ್ನಾಟಕ

గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళ మైనపు విగ్రహం వైరల్‌ అవుతోంది. అచ్చం మనిషిని పోలి ఉన్న మైనపు విగ్రహం చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలు.. కర్ణాటకలోని కొప్పళ జిల్లాకు చెందిన శ్రీనివాసగుప్తా భార్య కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. భార్యను మర్చిపోలేని శ్రీనివాసగుప్తా ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భౌతికంగా తన భార్య లేకున్నా.. విగ్రహం చూస్తూ ఆనందంగా గడిపే వీడియో దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందనే భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. మొహంలో చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడుతున్న విగ్రహాన్ని చూస్తే బొమ్మేనా అనే సందేహం రాక మానదు. వేడుకకు వచ్చిన వారు మైనపు బొమ్మతో ఫొటోలు దిగి పోస్ట్‌ చేయడంతో.. ఇప్పుడా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.