images

కరోనాను ‘లక్ష’ణంగా జయించారు

ಬೆಂಗಳೂರು

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడుతున్న విధంగానే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్ష మంది పైగా రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. సగం కంటే ఎక్కువ మంది ఇంటి బాట పట్టారు. కర్ణాటక వ్యాప్తంగా ఇప్పటివరకు 1,88,611 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మంగళవారం సాయంత్రం నాటికి 1,05,599 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం 79,606 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇందులో 699 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కోవిడ్‌ కాటుకు 3398 మంది బలి అయ్యారు.