25 తర్వాత కర్ణాటకలో కరోనా విజృంభణ:

జనరల్

ఈనెల 25 తర్వాత కర్ణాటకలో  కరోనా మరింత విజృంభిస్తుందా?  అంటే  అవుననే చెబుతున్నాయి కరోనా తాజా గణాంకాలు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు  రెట్టింపు అయ్యే రోజులు భారీగా తగ్గుతున్నాయి.  కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మే 2 నాటికి 600 చేరింది.  ఆపై 16 రోజులకు (మే  18)ఈసంఖ్య  రెట్టింపు అంటే 1200కు చేరింది.  ఇక రాష్టంలో కేసుల సంఖ్య 1000 నమోదైంది మే 15న అయితే ఆ సంఖ్య  రెట్టింపు అంటే 2000కు చేరేందుకు 8రోజులే  పట్టింది. మే 23నాటికే కేసుల సంఖ్య 1959కి చేరగా ఇంకో రోజులో 2వేల మార్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

download 67

25తర్వాత మరింత వేగం:

మే 25 నుంచి  దేశీయ విమానాలు సంచరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.  రైళ్లు,  బస్సుల్లో వస్తుంటేనే కేసుల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే ఇక విమానాల సంచారం మొదలైతే తక్కువ రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కాగలవు.  వ్యాపారవేత్తలు,  గర్భిణులు,  10ఏళ్ళ లోపు 80ఏళ్ళ పైబడిన వారికి క్వారంటైన్ నిబంధనల్లో మినహాయింపులు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవకాశమే  వీఐపీ సంస్కృతి మరోసారి జడలు విప్పి కరోనా వ్యాప్తిని పెంచి పోషించగలదు.