146

కరోనా నుంచి కోలుకున్న సిద్దరామయ్య

జనరల్

– మణిపాల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
– వారం రోజులు ఇంట్లోనే విశ్రాంతి

బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రి నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. మరో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రెండోసారి జరిగిన కరోనా పరీక్షలోనూ నెగటివ్‌ రావటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశానమి వైద్యులు తెలిపారు. గత 10 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స ఇచ్చిన వైద్యులు, సిబ్బందికి సిద్దరామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్ర ప్రజలకు సిద్దరామయ్య ధన్యవాదాలు తెలిపారు.